Tuesday, May 7, 2024
Homeజిల్లా వార్తలుతొమ్మిది మంది పేకాట రాయుళ్ల అరెస్ట్...

తొమ్మిది మంది పేకాట రాయుళ్ల అరెస్ట్…

రూ.50,700 నగదు స్వాధీనం…
స్పాట్ వాయిస్, జమ్మికుంట: జమ్మికుంట మండలం శంభునిపల్లి గ్రామంలో పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని అరెస్టు చేసి వారి నుండి రూ,50,700లను స్వాధీనం చేసుకున్నట్లు జమ్మికుంట సీఐ రవి తెలిపారు. శంభునిపల్లి గ్రామంలోని ఓ ఇంట్లో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు శనివారం సాయంత్రం కరీంనగర్ టాస్క్ ఫోర్స్ సీఐ రవీందర్, జమ్మికుంట సీఐ రవి సంయుక్తంగా దాడి చేశారు. ఇందులో పేకాట ఆడుతున్న తొమ్మది మందిని అరెస్టు చేయడంతో పాటు రూ. 50,700 నగదును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో 1) అట్లూరి రాజేశ్వర చారి, 2) మాది రెడ్డి వెంకట్ రెడ్డి, 3) మాదారి కృష్ణారెడ్డి, 4) రేగుల రఘు, 5) అప్పల సతీష్, 6) ప్రతాప రాజు, 7) శివరాత్రి రాజు, 8) కేతిపల్లి నరసింహారెడ్డి, 9) గుంట శ్రీనివాస్ రెడ్డి ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments