Sunday, May 19, 2024
Homeజిల్లా వార్తలుటీజీటీఏ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ ఎన్నిక

టీజీటీఏ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ ఎన్నిక

నూతన అధ్యక్షుడిగా కె.విశ్వప్రసాద్
కమిటీ సభ్యులకు శుభాకాంక్షల వెల్లువ
స్పా్ట్ వాయిస్, హన్మకొండ : ఉమ్మడి వరంగల్ జిల్లా రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం బీమారంలోని కేఎల్ ఎన్ కన్వెన్షల్ లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ తహసీల్దార్స్ అసోసియేషన్ (టీజీటీఏ) ఉమ్మడి వరంగల్ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నట్లు యూనియన్ నాయకులు తెలిపారు. నూతన అధ్యక్షుడిగా కె.విశ్వప్రసాద్ (వరంగల్), జనరల్ సెక్రటరీగా అల్లం రాజ్ కుమార్(ములుగు), ట్రెజరర్ గా ఎన్.విజయభాస్కర్ (ములుగు), అసోసియేట్ ప్రెసిడెంట్ గా పి.కిరణ్ కుమార్ (వరంగల్ ), వైస్ ప్రెసిడెంట్లుగా వి.విజయ్ సాగర్ (వరంగల్ ), రవీందర్(జనగామ), మంజుల(భూపాలపల్లి), ప్రవీన్(హన్మకొండ), జనరల్ సెక్రటరీగా బి. రాజేశ్(వరంగల్), సెక్రటరీలుగా కోమి(వరంగల్), వెంకటస్వామి(వరంగల్), రవికుమార్(భూపాలపల్లి), చల్లా ప్రసాద్ (హన్మకొండ), వినోద్ (మహబూబాబాద్), ఈసీ మెంబర్లుగా వై.శ్రీనివాస్ (భూపాలపల్లి), రమాదేవి ఎన్నికైనట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో టీజీటీఏ ప్రెసిడెంట్ బి. నాగేశ్వర్ రావు, వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ ఇక్బాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కె.విక్రమ్ కుమార్ తోపాటు పలువురు ఉద్యోగ సంఘాల నేతలు, ఉద్యోగులు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments