Sunday, May 19, 2024
Homeజాతీయంభద్రకాళికి మోదీ ప్రత్యేక పూజలు

భద్రకాళికి మోదీ ప్రత్యేక పూజలు

పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు
ఆరుగురు అర్చకులకే అనుమతి..
ఆలయం అంతా భద్రత సిబ్బందే..


స్పాట్ వాయిస్, ఓరుగల్లు: ప్రధాని నరేంద్ర మోడీ భద్రకాళి ఆలయానికి చేరుకున్నారు. మామూనురు ఎయిర్ పోర్టుకు చేరుకున్న పీఎంకు వరంగల్, హన్మకొండ కలెక్టర్లతో పాటు బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. నరేంద్ర మోడీ అక్కడి నుంచి నేరుగా భద్రకాళి ఆలయానికి చేరుకోగా.. పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ముందుగా ఆలయ ఆవరణలో గల గోశాల నందు గో సేవలో పాల్గొని గోవులకు గ్రాసాన్ని తినిపించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. పీఎం ఆలయానికి వస్తుండడంతో ప్రత్యేకంగా అలకరించారు. అలాగే దేవాలయం వద్ద కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు. పీఎం రాక సందర్భంగా ఆలయంలో కేవలం ఆరుగురు అర్చకులకు మాత్రమే అనుమతి ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments