Sunday, May 19, 2024
Homeజిల్లా వార్తలుకష్టపడిన వారికి కాంగ్రెస్ న్యాయం చేస్తుంది.. 

కష్టపడిన వారికి కాంగ్రెస్ న్యాయం చేస్తుంది.. 

కష్టపడిన వారికి కాంగ్రెస్ న్యాయం చేస్తుంది.. 

. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్

  ప్రకాష్ కు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడంపై హర్షం. 

శుభాకాంక్షలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

స్పాట్ వాయిస్, టేకుమట్ల: అధికారం ఉన్నా లేకున్నా పార్టీని నమ్ముకుని, ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని సిద్ధాంతాల కోసం పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తింపు నిస్తూ కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తుందని ఆ పార్టీ టేకుమట్ల మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ పదవి కాంగ్రెస్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు ఐతే ప్రకాష్ కు ఇవ్వడమే ఇ oదుకు నిదర్శనం అన్నారు. ఈ సందర్భంగా ఆయన యూత్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బండ శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు కొయ్యల చిరంజీవి గౌడ్, వంగ నరేష్ లతో కలిసి ప్రకాష్ ని కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ.. 25 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న లేకున్నా పార్టీ ఉన్నతికి తన వంతు ప్రయత్నం చేసి, తనలాంటి ఎంతో మంది యువకులు రాజకీయాల్లో రాణించడానికి, అన్ని విధాలుగా ప్రోత్సహించి ముందుకు తీసుకు వచ్చిన ప్రకాష్ కి రాష్ట్రస్థాయిలో అధిష్టానం గుర్తించడం సంతోషంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ జెండాను, సిద్ధాంతిని నమ్ముకుని, పార్టీ కోసం పని చేసిన ప్రతి ఒక్క కార్యకర్త కు గుర్తింపు దక్కుతుంది అనడానికి ఇదొక నిదర్శనం అని సతీష్ గౌడ్ చెప్పారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments