Sunday, May 19, 2024
Homeక్రైమ్మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్

మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుల్లో భారీ ఎన్ కౌంటర్

నలుగురు డీవీసీ సభ్యులు మృతి..
స్పాట్ వాయిస్, మహదేవపూర్: మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుల్లోని రేపన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఉన్న కోలా మరక అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగియి. ఇందులో తెలంగాణ రాష్ట్ర కమిటీకి చెందిన నలుగురు మావోయిస్టు అగ్రనేతలు మృతిచెందారు. వారిని డీవీసీ సభ్యులు వర్గీష్‌, మంగాతు, ప్లాటూన్‌ సభ్యులు కురుసం రాజు, వెంకటేశ్‌గా గుర్తించారు. వర్గీస్‌ మంచిర్యాల డివిజన్‌ కమిటీ సెక్రటరీ కాగా..మగ్తూ చెన్నూరు ఏరియా కమిటీ సెక్రటరీ, రాజు, వెంకటేశ్‌ ప్లటూన్‌ మెంబర్లు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ఇద్దరిపై రూ.36 లక్షల చొప్పున రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కోలా మరక అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments