Sunday, May 19, 2024
Homeలేటెస్ట్ న్యూస్భూ కబ్జా కేసులో భూపాలపల్లి కౌన్సిలర్ అరెస్ట్

భూ కబ్జా కేసులో భూపాలపల్లి కౌన్సిలర్ అరెస్ట్

భూ కబ్జా కేసులో భూపాలపల్లి కౌన్సిలర్ అరెస్ట్

స్పాట్ వాయిస్, బ్యూరో: భూ కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే హెచ్చరించారు. భూ కబ్జాకు యత్నించిన కౌన్సిలర్ కొత్త హరిబాబును మంగళవారం భూపాలపల్లి పోలీసులు అరెస్టు చేసినట్లు ఎస్పి తెలిపారు. భూపాలపల్లి పరిధిలోని కాసింపల్లికి చెందిన ఓ వ్యక్తికి చెందిన జామాయిల్ తోటను ధ్వంసం చేసి కాపలాదారులపై దాడి చేసి అక్రమంగా రోడ్లు వేసి పక్కా ప్రణాళికతో భూమిని కబ్జా చేసేందుకు యత్నిoచాడు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన భూపాలపల్లి పోలీసులు, మున్సిపల్ కౌన్సిలర్ కొత్త హరిబాబుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments