Tuesday, May 7, 2024
Homeలేటెస్ట్ న్యూస్కంటైనర్ కిందకు దూసుకెళ్లిన కారు..

కంటైనర్ కిందకు దూసుకెళ్లిన కారు..

అక్కడిక్కడే భార్యభర్తలు మృతి..
యాక్సిడెంట్ వీడియో రిలీజ్ చేసిన పోలీసులు..

స్పాట్ వాయిస్, క్రైం: సూర్యాపేట జిల్లా కోదాడ మునగాల మండలం ముకుందాపురం స‌మీపంలో సోమ‌వారం ఘోర రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఆగివున్న కంటైనర్ కింద‌కు వేగంగా వ‌చ్చిన ఓ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న భార్యాభ‌ర్తలిద్దరూ అక్కడిక‌క్కడే ప్రాణాలు కోల్పోయారు. కారులోనే మృత‌దేహాల‌ను ఇరుక్కుపోయాయి. ఈ ప్రమాద ఘ‌ట‌న‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు విడుద‌ల చేశారు. కారు అతివేగంతో కంటైన‌ర్ కింద‌కు దూసుకెళ్లింది. వీడియోను చూసిన వారు షాక్ అవుతున్నారు. మృతుల‌ను నవీన్ రాజా(29), భార్గవి(24)గా గుర్తించారు. వీరిద్దరూ హైద‌రాబాద్ నుంచి విజ‌య‌వాడ వెళ్తుండ‌గా ఈ ప్రమాదం జ‌రిగింది. కంటైన‌ర్ కింద ఇరుక్కుపోయిన కారును అతిక‌ష్టం మీద బ‌య‌ట‌కు తీశారు. ఆ త‌ర్వాత మృత‌దేహాల‌ను కారులో నుంచి బ‌య‌ట‌కు తీసి పోస్టుమార్టం నిమిత్తం కోదాడ ఆస్పత్రికి త‌ర‌లించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments