చంద్రబాబుకు మధ్యంతర బెయిల్
స్పాట్ వాయిస్, బ్యూరో : టీడీపీ చీఫ్ చంద్రబాబుకు ఊరట లభించింది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబునాయుడికి మధ్యంతర బెయిల్ లభించింది. ఈ విషయమై మంగళవారం ఏపీ హైకోర్టు తీర్పును వెల్లడించింది. చంద్రబాబుకి నాలుగు వారాలపాటు బెయిల్ ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది చంద్రబాబునాయుడుకు అనారోగ్య కారణాలతో ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు జైలులో ఉన్నారు. ఈ ఏడాది నవంబర్ 28న లొంగిపోవాలని చంద్రబాబును కోర్టు ఆదేశించింది. ప్రధాన బెయిల్ పిటిషన్ పై ఈ ఏడాది నవంబర్ 10వ తేదీన ఏపీ హైకోర్టు విచారించనుంది. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ కేసు ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన చంద్రబాబును ఏపీ సీఐడీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో అరెస్టైన చంద్రబాబు జ్యుడీషీయల్ రిమాండ్ లో ఉన్నారు. రేపటితో చంద్రబాబు జ్యుడీషీయల్ రిమాండ్ పూర్తి కానుంది. అయితే మంగళవారం చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. హైకోర్టు ఆదేశాలను చంద్రబాబు తరపు న్యాయవాదులు రాజమండ్రి జైలు అధికారులకు అందించనున్నారు. ఈ ప్రక్రియ పూర్తైతే చంద్రబాబు జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
Recent Comments