Wednesday, April 9, 2025
Homeక్రైమ్రెండు బైకులు ఢీ...ఇద్దరికి తీవ్ర గాయాలు

రెండు బైకులు ఢీ…ఇద్దరికి తీవ్ర గాయాలు

రెండు బైకులు ఢీ…ఇద్దరికి తీవ్ర గాయాలు

గణపురంలో ఘటన

స్పాట్ వాయిస్, గణపురం: ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీ కొనడంతో ఇద్దరికీ తీవ్రగాయాలైన ఘటన మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పరకాల మండలం రంగాపురం గ్రామానికి చెందిన ఎంజపెల్లి రవి అనే వ్యక్తి తన బైక్ పై గణపురంకు వస్తుండగా అదే సమయంలో ములుగు జిల్లా వెంకటాపురం మండలం వెర్తుల్లపల్లి గ్రామానికి చెందిన బీరెల్లి రాజు తన బైక్ పై రేగొండకు వెళుతున్నాడు. ఈ క్రమంలో గణపసముద్రం చెరువు మత్తడి సమీపంలో ఎదురెదురుగా రెండు బైకులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108 వాహనంలో ములుగు సివిల్ ఆసుపత్రికి తరలించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments