Sunday, May 19, 2024
Homeజనరల్ న్యూస్చట్నీ ఎక్కువైందన్న భర్త..

చట్నీ ఎక్కువైందన్న భర్త..

చట్నీ ఎక్కువైందన్న భర్త..

మనస్తాపానికి గురైన భార్య 

భర్త డ్యూటీకి వెళ్ళగానే ఉరేసుకుని ఆత్మహత్య

స్పాట్ వాయిస్, డెస్క్: క్షణికావేశంలో ప్రాణాలు తీసుకోవడం అంటే ఇదేనేమో… చట్నీ ఎక్కువైందని జరగిన గొడవలో భర్త అలగడంతో భార్య మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే….

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్‌ మండలం గోప తండాకు చెందిన రమణ ఖమ్మం జిల్లా పెగళ్లపాడుకు చెందిన బానోతు చందన ఇంట్లో వాళ్లను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకున్నారు. రమణ ప్రొడ్యూసర్ బండ్ల గణేశ్ వద్ద డ్రైవర్‌ గా పని చేస్తుండగా.. చందన జ్యువెలరీ షాపులో పని చేస్తోంది. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 2 లోని అపార్ట్‌మెంట్‌లో వీరు నివాసం ఉంటున్నారు. ఆదివారం రాత్రి భోజనం చేస్తున్న సమయంలో చట్నీ ఎక్కువ వేశావంటూ రమణ భార్యతో గొడవపడ్డాడు. దీంతో చందన మనస్తాపానికి గురైంది. సోమవారం ఉదయం రమణ డ్యూటీకి వెళ్లిన తర్వాత చందన రమణ కు పలు మార్లు వీడియో కాల్స్ చేసింది. రమణ స్పందించకపోవడంతో నార్మల్ కాల్ చేసి తాను చనిపోతున్నానని చెప్పి ఫోన్‌ కట్ చేసింది. వెంటనే అలర్ట్ అయిన రమణ.. ఇంటి ఓనర్ కు ఫోన్ చేశాడు. వారు వెళ్లేసరికి తలుపులు లోపలి నుంచి గడియ పెట్టి ఉంది. చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే ఆమె చనిపోయి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. భర్త రమణను అదుపులోకి తీసుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments