Wednesday, April 9, 2025
Homeక్రైమ్ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి

ఈతకు వెళ్లి ఇద్దరు బాలురు మృతి

తొర్రూరు మండలంలో జిల్లాలో విషాదం
స్పాట్ వాయిస్, తొర్రూరు : చెరువులో ఈతకు వెళ్లిన ఇద్దరు పిల్లలు మృత్యువాత పడ్డారు. ఈ విషాధ ఘటన ఆదివారం మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురంలో చోటుచేసుకుంది. స్థానికంగా నివసిస్తున్న బుడగ జంగాల కులానికి చెందిన పన్నేండ్లలోపు ఉన్న ఇద్దరు పిల్లలు గ్రామ పెద్ద చెరువువద్ద ఊత కొడుతుండగా ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందారు. అప్పటి వరకు తమ కండ్ల ముందే తిరిగిన పిల్లలు విగతజీవులు కావడంతో తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments