నేడే మెగా డీఎస్సీ నోటిఫికేషన్..
పరీక్షల తేదీలు ఫిక్స్..
స్పాట్ వాయిస్, ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి సర్కార్ సిద్ధమైంది. 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ను సీఎం రేవంత్రెడ్డి గురువారం విడుదల చేయనున్నారు.
పోస్టులు ఇన్ని..
స్కూల్ అసిస్టెంట్ 2629, భాషా పండితులు 727, పీఈటీలు 182, ఎస్జీటీలు 6,508, ప్రత్యేక కేటగిరీలో స్కూల్ అసిస్టెంట్లు 220, ఎస్జీటీలు 796 పోస్టులున్నాయి.
పరీక్షలు ఎప్పుడoటే..
మే లేదా జూన్లో 10 రోజుల పాటు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
మళ్లీ దరఖాస్తు అవసరం లేదు
కొత్త నోటిఫికేషన్కు నిర్ణయించిన ప్రభుత్వం, గతేడాది సెప్టెంబరు 6న 5089 పోస్టులతో జారీ చేసిన డీఎస్సీ (2024) ప్రకటన రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సమగ్రంగా మరో కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని అందులో పేర్కొంది. పాత దరఖాస్తులు చెల్లుబాటులో ఉంటాయని, నూతన డీఎస్సీకి వాటిని పరిగణనలోనికి తీసుకుంటామని పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వెల్లడించారు. పాత అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదన్నారు.
Recent Comments