Sunday, May 19, 2024
Homeక్రైమ్సీఐ పై పొక్సో కేసు

సీఐ పై పొక్సో కేసు

సీఐ పై పొక్సో కేసు

స్పాట్ వాయిస్, క్రైమ్: కాకతీయ యూనివర్సిటీ పోలీస్టెషన్ లో గతంలో ఎస్సై గా పనిచేసి ప్రస్తుతం సీఐగా భూపాలపల్లి జిల్లాలో పనిచేస్తున్న పోలీస్ అధికారి పై ఫోక్స్ చట్టం కింద కేసు నమోదైనట్లు సమాచారం. 2022 లో కేయూలో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సమయంలో సదురు అధికారి స్టేషన్ పరిధిలో ఒక మహిళతో సన్నిహిత సంబంధాలున్నట్లు సమాచారం. ఈ విషయంలో మహిళా భర్త పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు చేయగా ఏఆర్ కు అటాచ్ చేసినట్లు తెలిసింది. అనంతరం సీఐగా పదోన్నతి పొంది ఖమ్మం జిల్లాకు, అటునుంచి భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వెళ్లిన సదురు అధికారి ఇంకా మహిళాతోనే సన్నిహిత సంబంధం కొనసాగిస్తున్నట్టు సమాచారo. ఈ క్రమంలో సదరు మహిళా కూతురిపై కన్నేసిన పోలీస్ అధికారి అత్యాచార యత్నానికి పాల్పడినట్లు ఇటీవల కేయూ పీఎస్ లో మహిళా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. విచారణ చేసిన కేయూ పోలీసులు.. గురువారం సదరు అధికారి పై అత్యాచార యత్నం, ఫోక్స్ కేసు నమోదు చేసినట్లు తెలిసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments