Tuesday, June 3, 2025
Homeక్రైమ్జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య

జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య

స్పాట్ వాయిస్, నర్సంపేట,(ఖానాపురం): మండలంలోని రంగాపురం గ్రామ జూనియర్ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసే బైరు సోనీ(29) ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం విధుల్లోకి వచ్చిన అనంతరం పురుగుల మందు తాగినట్లు తెలుస్తోంది. చికిత్స నిమిత్తం నర్సంపేటలోని ఓ ప్రభుత్వ ద‌వాఖాన‌కు తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందినట్లు సమాచారం. నర్సంపేట పట్టణంలో ఉండే ఆమెకు ఒక పాప ఉంది. సమాచారం తెలుసుకున్న నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆస్పత్రి వద్దకు వెళ్లి మృతదేహాన్ని సందర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments