Sunday, May 19, 2024
Homeజనరల్ న్యూస్ఏడాదిలోపు పిల్లలున్న తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనం ఫ్రీ

ఏడాదిలోపు పిల్లలున్న తల్లిదండ్రులకు శ్రీవారి దర్శనం ఫ్రీ

ఏడాదిలోపు పిల్లలున్న తల్లిదండ్రులకు
శ్రీవారి దర్శనం ఫ్రీ
టీటీడీ బంపర్ ఆఫర్
స్పాట్ వాయిస్, బ్యూరో: తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనం కోసం వచ్చే ఏడాదిలోపు పిల్లలున్న తల్లిదండ్రులు వృద్ధులు, శారీరక, మానసిక వైకల్యంతో బాధపడుతున్న వారికి టీటీడీ బంపర్ ఆఫర్ ఇచ్చింది. గంటలు గంటలు వేచి చూసే బాధ నుంచి విముక్తి కల్పించింది. ఏడాదిలోపు పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఉచితంగా.. అది కూడా ప్రత్యేక దర్శన భాగ్యం కల్పిస్తోంది. దీంతో ఏడాది లోపు పిల్లలతో తల్లిదండ్రులు స్వామివారి దర్శనం కోసం కంపార్ట్‌మెంట్లలో వేచి ఉండక్కర్లేదు. నేరుగా దర్శానానికి పంపిస్తారు. దర్శనం కోసం కొన్ని నియమ, నిబంధలు ఉన్నాయి.
నిబంధనలు ఇవే..
*కచ్చితంగా ఒరిజనల్ బర్త్ సర్టిఫికేట్ తీసుకువెళ్లాల్సి ఉంటుంది.
* ఒకవేళ బర్త్ సర్టిఫికేట్ లేని పక్షంలో ఆస్పత్రి నుంచి ఇచ్చే డిశ్చార్జ్ సమ్మరీ అయినా తీసుకెళ్లవచ్చు.
*అలాగే తల్లిదండ్రుల ఐడీ కార్డులు (ఆధార్, ఓటర్ ఐడీ, పాన్ వంటివి) కచ్చితంగా ఉండాలి.
*ఉదయం 8.30 గంటల నుంచి 10.30 వరకు మళ్లీ మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు..
* సుపథం నుంచి దర్శనానికి నేరుగాఅనుమతిస్తారు.
* అక్కడ బర్త్ సర్టిఫికెట్, తల్లిదండ్రులు ఐడీ ప్రూఫ్స్‌ను టీటీడీ సిబ్బంది పరిశీలించిన తర్వాతే దర్శనానికి అనుమతిస్తారు.
*ఈ ప్రత్యేక దర్శనానికి ఏడాదిలోపు చిన్నారి తల్లిదండ్రులతో పాటు 12లోపు మరో పాప/బాబును అనుమతిస్తారు.
* మిగిలిన కుటుంబ సభ్యులు ఎవరినీ అనుమతించరు.
* ఈ దర్శనం కోసం ముందుగా ఎలాంటి టికెట్ బుకింగ్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు.. పూర్తిగా ఉచితం.
* ఈ దర్శనానికి వెళ్లే తల్లిదండ్రులు, పిల్లలు కూడా సంప్రదాయ దుస్తుల్లోనే రావాలి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments