Sunday, May 19, 2024
Homeతెలంగాణతొలి తెలుగు న్యూస్ రీడర్ మృతి 

తొలి తెలుగు న్యూస్ రీడర్ మృతి 

తొలి తెలుగు న్యూస్ రీడర్ మృతి 

స్పాట్ వాయిస్, బ్యూరో: దూర‌ద‌ర్శ‌న్ న్యూస్ రీడ‌ర్ శాంతిస్వ‌రూప్ మృతి చెoదారు. టీవీలో వార్త‌ల‌ను చ‌దివే తొలిత‌రం న్యూస్ రీడ‌ర్‌గా శాంతిస్వ‌రూప్ త‌న‌కంటూ ఒక ప్ర‌త్యేక గుర్తింపు పొందారు. రెండు రోజుల క్రితం గుండెపోటుకు గురైన శాంతి స్వ‌రూప్.. హైద‌రాబాద్ య‌శోదా ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతూ శుక్ర‌వారం ఉద‌యం తుదిశ్వాస విడిచారు. 1983 న‌వంబ‌ర్ 14న దూరద‌ర్శ‌న్ చానెల్‌లో శాంతి స్వ‌రూప్ తెలుగులో తొలిసారి వార్త‌లు చ‌దివారు. ప‌దేండ్ల పాటు టెలీప్రాంప్ట‌ర్ లేకుండా పేప‌ర్ చూసి వార్త‌లు ప్ర‌జ‌ల‌కు వినిపించారు. తొలి తెలుగు న్యూస్ రీడ‌ర్‌గా చెర‌గ‌ని ముద్ర వేశారు. 2011లో ప‌ద‌వీ విర‌మ‌ణ చేసే వ‌ర‌కు శాంతి స్వ‌రూప్ వార్త‌లు చ‌దివారు. లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును కూడా ఆయ‌న అందుకున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments