Sunday, May 19, 2024
Homeలేటెస్ట్ న్యూస్నందమూరి తారకరత్నకు అస్వస్థత

నందమూరి తారకరత్నకు అస్వస్థత

స్పాట్ వాయిస్, డెస్క్ : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర శుక్రవారం కుప్పం నుంచి ప్రారంభమైoది. ఈ పాదయాత్రలో పాల్గొన్న నటుడు నందమూరి తారకరత్న అస్వస్థతకు గురయ్యారు. లోకేష్‌ పాదయాత్రలో నడుస్తూ సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం కుప్పం కేసీ ఆస్పత్రికి తరలించారు. బాలకృష్ణ సైతం ఆసుపత్రికి చేరుకున్నారు. నిన్నటి నుంచి కూడా నారా లోకేష్‌తో పాటు పలు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు. పాదయాత్రలో పెద్ద మొత్తంలో జనం హాజరవడం.. కాస్త తోపులాట జరగడంతో తారకరత్న ఇబ్బందికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తారకరత్న సొమ్మసిల్లి పడిపోయారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తుంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments