Sunday, May 19, 2024
Homeక్రైమ్హన్మకొండ ‘హరిత’ లో అగ్ని ప్రమాదం

హన్మకొండ ‘హరిత’ లో అగ్ని ప్రమాదం

కిచెన్ లో చెలరేగిన మంటలు
మంటలు ఆర్పిన ఫైర్ సిబ్బంది
స్పాట్ వాయిస్, హన్మకొండ : హనుమకొండలోని హరిత కాకతీయ హోటల్ లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శనివారం సాయంత్రం కిచెన్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో చుట్టుముట్టగా, హోటల్ ఆవరణ అంతా దట్టమైన పొగ ఆవరించింది. దీంతో అందులో పనిచేసే సిబ్బంది, కార్మికులు భయబ్రాంతులకు గురై బయటకు పరుగులు తీశాయి. వెంటనే సిబ్బంది ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. దీంతో సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ఘటనలో కిచెన్ లోని వస్తు సామగ్రి చాలా కాలిపోయిందని, భారీగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం ఎలా జరిగిందనే పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments