స్పాట్ వాయిస్, హన్మకొండ: గురుకుల పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో ప్రవేశానికి నిర్వహించే పరీక్షకు దరఖాస్తు గడువును ఈ నెల 20 వరకు పొడిగించినట్లు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకులాల జిల్లా కోఆర్డినేటర్ సమ్మయ్య సోమవారం ప్రకటనలో తెలిపారు. ఎస్సీ,ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో ఇంగ్లిష్ మీడియంలో 5వ తరగతిలో ప్రవేశానికి అర్హులైన విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఫిబ్రవరి 11న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రవేశ పరీక్ష నిర్వహించి మెరిట్, రిజర్వేషన్ ఆధారంగా విద్యార్థులను ఎంపిక చేస్తారన్నారు. ప్రస్తుతం నాలుగో తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని, విద్యార్థులు బోనఫైడ్ లేదా స్టడీ కండక్ట్ సర్టిఫికెట్ను జత చేయాల్సి ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు 180042545678 టోల్ ఫ్రీ నంబరుకు సంప్రదించాలని ఆయన కోరారు.
Recent Comments