Sunday, May 19, 2024
Homeకెరీర్గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ఫైన‌ల్ 'కీ' విడుదల

గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ఫైన‌ల్ ‘కీ’ విడుదల

గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ఫైన‌ల్ ‘కీ’ విడుదల 

స్పాట్ వాయిస్, హైదరాబాద్ : గ్రూప్-1 ప్రిలిమిన‌రీ ఫైన‌ల్ ‘కీ’ మంగళవారం విడుద‌లైంది. తుది కీని టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో ఉంచిన‌ట్లు అధికారులు తెలిపారు. త్వ‌ర‌లోనే ఫ‌లితాలు విడుద‌ల కానున్నాయి. గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫ‌లితాలు ప్ర‌క‌టించిన త‌ర్వాత 1:50 నిష్ప‌త్తిలో అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు. టీఎస్‌పీఎస్సీ మొత్తంగా 25,150 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేయ‌నుంది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లోని 994 సెంటర్లలో ఈ పరీక్షను నిర్వహించారు. ఈ పరీక్ష కోసం 3,80,081 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 2,32,457 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments