Sunday, May 19, 2024
Homeసినిమాజెనీలియా రీ ఎంట్రీ

జెనీలియా రీ ఎంట్రీ

స్పాట్ వాయిస్, హైదరాబాద్: వైవిధ్య భ‌రిత పాత్రల్లో న‌టిస్తూ టాలీవుడ్‌లో వెలుగువెలుగిన హీరోయిన్ జెనీలియా దేశ్‌ముఖ్‌ రీ ఎంట్రీ ఇస్తోంది. సై, బొమ్మరిల్లు, రెడీ వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్షకుల‌ను గుండెల్లో నిలిచిపోయింది ఈ ముద్దుగుమ్మ. బాలీవుడ్ యాక్టర్, ప్రొడ్యూసర్ రితీష్ దేశ్‌ముఖ్‌ను జెనీలియా 2013లో పెళ్లి చేసుకొని ముంబైలోనే సెటిల్ అయింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన జెనీలియా ఇటీవలే బాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వగా తాజాగా ఇప్పుడు తెలుగు తెరపై మళ్లీ మెరవనుంది. క‌ర్ణాట‌క మాజీ మంత్రి గాలి జ‌నార్దన్ రెడ్డి కుమారుడు కిరీటి హీరోగా ప‌రిచ‌య‌వుతూ ఓ చిత్రం తెర‌కెక్కతున్న విష‌యం తెలిసిందే. రాధాకృష్ణ ఈ చిత్రానికి ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నాడు. తెలుగు,క‌న్నడ భాష‌ల్లో ద్విభాషా చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రాన్ని వారాహి చ‌ల‌న చిత్రం ప‌తాకంపై ర‌జినీ కొర్రపాటి నిర్మిస్తున్నారు. ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్‌గా తెర‌కెక్కిస్తున్నారు. 2012లో రానా న‌టించిన ‘నా ఇష్టం’ త‌రువాత జెనీలియా ఇప్పటి వ‌ర‌కు సౌత్‌ సినిమాలో న‌టించ‌లేదు. ఈ చిత్రం జెనీలియా కీల‌క‌పాత్రలో కనిపించనుందట. దీని గురించి జెనీలియా ఇన్స్టాగ్రామ్‌లో ‘సౌత్ సినిమాల్లోకి నా రీఎంట్రీని ఇస్తున్నాను. నా ఇంటిగా భావించే ఇంటికి ఇన్ని రోజులు దూరంగా ఉన్నాను. నన్ను గుర్తుంచుకొని మరీ ఈ సినిమాలో భాగస్వామిని చేసినందుకు సాయి కొర్రపాటి, రాధాకృష్ణ రెడ్డికి ధన్యవాదాలు’ అంటూ జెనీలియా పోస్ట్ చేసింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments