Sunday, May 19, 2024
Homeతెలంగాణచార్లెస్ శోభరాజ్ లెక్క కేసీఆర్..

చార్లెస్ శోభరాజ్ లెక్క కేసీఆర్..

దూలం లెక్క పెరిగిన హరీష్ రావు..
ఒంటి కన్ను శివరాజ్.. (పువ్వాడ)పై సెటైర్..
ఫైర్ అయిన సీఎం రేవంత్ రెడ్డి
స్పాట్ వాయిస్, బ్యూరో: తాను గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవ్వరూ కేసీఆర్ వెంట ఉండరని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒక్కటై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేస్తున్నాయని మండిపడ్డారు. మణుగూరులో సోమవారం జరిగిన ప్రజా దీవెన సభలో బీఆర్ఎస్, బీజేపీ నేతలపై సీఎం రేవంత్ మండిపడ్డారు. తండ్రీకొడుకులు.. మామా, అల్లుడు రోజు తనకు శాపనార్థాలు పెడుతున్నారని విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలనను చూసి వారు అక్కసు వెళ్లగక్కుతున్నారని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి హరీష్ రావు దూలం లెక్క పెరిగిండు కానీ బుద్ది మాత్రం పెరగలేదని ఆరోపించారు. కేసీఆర్ చార్లెస్ శోభ రాజ్ లెక్క తయారయ్యారని ఎద్దేవా చేశారు. ఖమ్మం ఒంటి కన్ను శివరాజ్ (మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ని ఉద్దేశించి) ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల కోసం మాజీ సీఎం కేసీఆర్, ప్రధాని మోడీ చీకట్లో ఒప్పందం చేసుకున్నారన్నారు. మోడీ, ఖేడీ ఒక్కటై కాంగ్రెస్ ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. నల్లమల నుంచి తొక్కుకుంటూ వచ్చి ప్రగతి భవన్ గేట్లు బద్దలు కొట్టానని తెలిపారు. సీతారామ ప్రాజెక్ట్, కరకట్ట, పులుసు బొంత ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ పనులను పూర్తి చేసే బాధ్యత కాంగ్రెస్ తీసుకుంటోందని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments