Sunday, May 19, 2024
Homeజాతీయంబీఆర్ఎస్ కు షాక్..

బీఆర్ఎస్ కు షాక్..

గుడ్ బై చెప్పిన ఎంపీ బీబీ పాటిల్
స్పాట్ వాయిస్, బ్యూరో : పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్‌ఎస్‌ పార్టీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత కాంగ్రెస్‌ పార్టీలో చేరగా, మరో కీలక నేత జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ బీఆర్ఎస్‌ పార్టీకి గుడ్ బై చెప్పారు. బీబీ పాటిల్ ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014, 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసి ఎన్నికయ్యారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ఆయన ఆ పార్టీకి కొంతకాలంగా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో శుక్రవారం బీబీ పాటిల్ తన రాజీనామా లేఖను పార్టీ అధినేత కేసీఆర్‌కు పంపారు. శుక్రవారం ఢిల్లీలో బీజేపీ రాష్ట్రవ్యవహారాల ఇంఛార్జ్‌ తరుణ్‌ చుగ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్స్‌ కేంద్రసహాయ మంత్రి రాజీవ్‌ చంద్రశేఖర్‌, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

 

RELATED ARTICLES

Most Popular

Recent Comments