Sunday, May 19, 2024
Homeజనరల్ న్యూస్పచ్చని సంసారంలో జోతిష్యం చిచ్చు..

పచ్చని సంసారంలో జోతిష్యం చిచ్చు..

పచ్చని సంసారంలో  జ్యోతిష్యం చిచ్చు..
అదే నిజమని నమ్మి మనస్థాపంతో గృహిణి ఆత్మహత్య

స్పాట్ వాయిస్, హైదరాబాద్: యూట్యూబ్‌లో  జ్యోతిష్యం  చెప్పినట్టుగా భార్యాభర్తలం ఇద్దరం విడిపోతామని నమ్మిన గృహిణి.. అలాంటివి నమ్మొద్దంటూ నచ్చజెప్పిన భర్త. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగడంతో అందరి ముందు భార్యపై భర్త చేయి చేసుకున్నాడు. ఇంకేముంది మనస్తాపంతో భార్య ఉరి వేసుకుని చనిపోయింది.
వివరాల్లోకి వెళ్తే..
హైదరాబాద్ అంబర్‌పేటకు చెందిన బబిత (28), సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రామకృష్ణ అలియాస్ రాము (30)తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. కానాజీగూడ ఇందిరానగర్‌లో కాపురం పెట్టిన దంపతులకు మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. జ్యోతిష్యాన్ని విపరీతంగా నమ్మే బబిత ఓ యూట్యూబ్‌లో చెప్పిన  జ్యోతిష్యం విన్నది. అందులో చెప్పినట్టుగా తాము విడిపోతామని బలంగా నమ్మింది. ఇదే విషయాన్ని భర్తతో తరచూ చెప్తే ఆయన పట్టించుకునేవాడు కాదు. ఈ క్రమంలో ఆదివారం నిర్వహించిన కుమారుడి బర్త్ డేకి బంధుమిత్రులందరూ హాజరయ్యారు. బబిత తల్లిదండ్రులు మాత్రం రాలేదు. సోమవారం ఉదయం రాము విధులకు వెళ్లగా, కుమారుడు అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లాడు. మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అంగన్‌వాడీ కేంద్రం నుంచి వచ్చి చిన్నారి తల్లి ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని కనిపించడంతో కంగారుపడిపోయాడు. వెంటనే కింది పోర్షన్‌లో ఉండే బాబాయికి చెప్పడంతో ఆయన వచ్చి ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించాడు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలిసిన బబిత తల్లిదండ్రులు రాముపై దాడి చేశారు. అదనపు కట్నం కోసం వేధించడం వల్లే కుమార్తె ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. అయితే,  జ్యోతిష్యాన్ని నమ్మె ఆమె ఆత్మహత్య చేసుకుందని, దానిని నమ్మవద్దని తాను పదేపదే చెప్పేవాడినని రాము చెప్పాడు. ఇటీవల ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఆగ్రహం పట్టలేని రాము భార్యపై అందరిముందు చేయిచేసుకున్నాడు. దీంతో ఆమె మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉంటుందని భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments