Saturday, April 19, 2025
Homeక్రైమ్రూ.500 కోసం వృద్ధురాలిని హత్య చేసిన వృద్ధుడు

రూ.500 కోసం వృద్ధురాలిని హత్య చేసిన వృద్ధుడు

రూ.500 కోసం వృద్ధురాలిని హత్య చేసిన వృద్ధుడు

మానుకోట జిల్లాలో ఘటన 

స్పాట్ వాయిస్, గూడూరు: రూ.500 కోసం ఓ వృద్ధుడు వృద్ధురాలిని హతమార్చాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా గూడూరు మండలంలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కోబల్‌తండా గ్రామ శివారు మూడుగుడిసెల లైన్‌తండాకు చెందిన తేజావత్‌ ఈరమ్మ (58) తండాలో కూలీ పనులు చేస్తూ జీవనo సాగిస్తోంది. ఆమె భర్త చనిపోగా సంతానం లేదు. ఈరమ్మ ఇంటి పక్కనే ఉన్న వృద్ధుడు తేజావత్‌ స్వామికి రూ.500 చేబదులుగా ఇచ్చింది. తన డబ్బు ఇవ్వాలని 3రోజులుగా ఈరమ్మ స్వామిని అడుగుతుంది. దీనితో ఆమెపై కక్ష పెంచుకున్న స్వామి బుధవారం రాత్రి ఈరమ్మను గొంతునులిమి హత్య చేసినట్టు పోలీసులు తెలిపారు. మృతురాలి అక్క కుమారుడి ఫిర్యాదు మేరకు పోలీసులు స్వామిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments