Sunday, May 25, 2025
Homeక్రైమ్కొడుకులను చెరువులోకి తోసి తల్లి ఆత్మహత్య..

కొడుకులను చెరువులోకి తోసి తల్లి ఆత్మహత్య..

 ఖమ్మం జిల్లాలో విషాదం..
స్పాట్ వాయిస్, ఖమ్మం: పాపం ఆ తల్లికి ఏం కష్టమొచ్చిందో ఏమో. కన్న బిడ్డలను చెరువులోకి తోసేసి.. తానూ ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘ‌ట‌న ఖ‌మ్మం జిల్లాలోని స‌త్తుప‌ల్లిలో జరిగింది. త‌ల్లి మృదుల‌, తన కొడుకులు మ‌హ‌దేవ్‌(7), ప్రజ్ఞ(5) ను చెరువులోకి తోసి.. ఆపై ఆమెకు కూడా చెరువులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ముగ్గురి మృత‌దేహాల‌ను గుర్తించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల స‌హాయంతో మృత‌దేహాల‌ను చెరువులో నుంచి బ‌య‌ట‌కు తీశారు. కేసు న‌మోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. వీరి ఆత్మహ‌త్యకు గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments