Monday, September 23, 2024
Homeక్రైమ్మానవత్వం చాటిన చిట్యాల జెడ్పీటీసీ

మానవత్వం చాటిన చిట్యాల జెడ్పీటీసీ

మానవత్వం చాటిన చిట్యాల జెడ్పీటీసీ
క్షతగాత్రులను ఎంజీఎంకు తరలించిన గొర్రె సాగర్
స్పాట్ వాయిస్, చిట్యాల : రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటారు చిట్యాల జెడ్పీటీసీ గొర్రె సాగర్… వివరాలిలా ఉన్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం జడల్ పేట గ్రామానికి చెందిన రాజిరెడ్డి, నారాయణ ఆదివారం చిట్యాల నుంచి జడల్ పేట గ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో జడల్ పేట బృహత్ పల్లె ప్రకృతి వనం వద్ద ప్రధాన రహదారిపై వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడిపోయింది. ఈ ఘటనలో రాజిరెడ్డి, నారాయణ తీవ్రంగా గాయపడ్డారు. ఇదే క్రమంలో అటుగా వెళ్తున్న చిట్యాల జెడ్పీటీసీ గొర్రె సాగర్ ఘటనను చూసి వెంటనే స్పందించారు. మిత్రుల సహాయంతో క్షతగాత్రుల బంధువులకు సమాచారం అందించారు. 108 కు ఫోన్ చేసి దగ్గరుండి అంబులెన్సులో వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు. దీంతో ఆయనను స్థానికులు అభినందించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments