Monday, April 21, 2025
Homeలేటెస్ట్ న్యూస్వైస్ షర్మిల దీక్ష భగ్నం

వైస్ షర్మిల దీక్ష భగ్నం

స్పాట్ వాయిస్, హైదరాబాద్: వైఎస్సార్​టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆమరణ నిరాహారదీక్షను పోలీసులు అర్ధరాత్రి భగ్నం చేశారు. రాత్రి సుమారు ఒంటిగంట సమయంలో ఆమెను పరీక్షించిన వైద్యులు.. ఆరోగ్యం క్షీణించినట్లు ప్రకటించారు. దీంతో పోలీసులు షర్మిలను అదుపులోకి తీసుకొని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. షర్మిల దీక్ష శిబిరం వద్దకు మీడియా రాకుండా పోలీసులు అడ్డుకున్నారు. పాదయాత్రకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. ఈనెల 9న లోటస్‌పాండ్‌లోని తన నివాసం వద్ద షర్మిల ఆమరణదీక్షకు దిగిన విషయం తెలిసిందే.

RELATED ARTICLES

Most Popular

Recent Comments