Sunday, September 22, 2024
Homeజిల్లా వార్తలువరల్డ్ పద్మశాలి క్లబ్ కు భూమి పూజ

వరల్డ్ పద్మశాలి క్లబ్ కు భూమి పూజ

వరల్డ్ పద్మశాలి క్లబ్ కు భూమి పూజ
హాజరైన రామ శ్రీనివాస్ దంపతులు, కులబాంధవులు
స్పాట్ వాయిస్, హన్మకొండ  : హన్మకొండ జిల్లా కాజీపేట మండలం శాయంపేట గ్రామం బట్టుపల్లి రోడ్డులోని ఐటీడీఏ ట్రైనింగ్ సెంటర్ పక్కన నిర్మిస్తున్న వరల్డ్ పద్మశాలి క్లబ్ (డబ్ల్యూపీసీ)కి ఆదివారం రామ శ్రీనివాస్ అధ్యక్షతన భూమి పూజ చేశారు. కార్యక్రమంలో రామ శోభ శ్రీనివాస్, పద్మశాలి కులబాంధవులు సతీసమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రామ శ్రీనివాస్ మాట్లాడుతూ వరల్డ్ పద్మశాలి క్లబ్ యావత్తు పద్మశాలి సమాజానికి మంచి వేదిక అవుతుందన్నారు. కులదైవమైన మార్కండేయుడి గుడి, అధునాతన టెక్నాలజీతో ఫంక్షన్ హాల్, స్విమ్మింగ్ పూల్స్, ఆహ్లాదమైన పార్కులు, పిల్లలకు, పెద్దలు ఆడుకునే విధంగా షటిల్ కోర్డు, బాస్కెట్ బాల్, ఇండోర్ స్టేడియం, వాకింగ్ ట్రాక్, ఫుడ్ కోర్ట్.. ఇతర అవసరాలకు అనుగుణంగా క్లబ్ నిర్మాణం చేపడతామని అన్నారు. కార్యక్రమంలో ఈగ మల్లేశం, బాసాని చంద్రప్రకాష్, కూరపాటి సుదర్శన్, మంతెన రమేష్, బాల్నే శరత్ బాబు, ఎక్కలదేవి రమేశ్, దుస్సా జనార్దన్, ఎలగం వెంకటమల్లు, కుసుమ సత్యనారాయణ, వడ్నాల మల్లయ్య సదానందం, గడ్డం కేశవ్ మూర్తి, గడ్డం భాస్కర్, బేతి అశోక్ బాబు, చందా మల్లయ్య, బొల్లు కేదారి, డాక్టర్లు కూరపాటి రమేష్, కూరపాటి మధు, మహేశ్వర్, శ్రవణ్ కుమార్, బలబద్ర రాము, అశోక్, వలస సుధీర్, ప్రేమ్ సాగర్, ఎలిగం శ్రీనివాస్, చిప్ప వెంకటేశ్వర్లు, పద్మశాలి పెద్దలు ప్రముఖులుకుల బాంధవులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments