Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలుఘనంగా సైలనీ బాబా ఉర్స్ గంధం వేడుకలు

ఘనంగా సైలనీ బాబా ఉర్స్ గంధం వేడుకలు

పాల్గొన్న హోం మంత్రి మహమూద్ అలీ
స్పాట్ వాయిస్ పరకాల: హజ్రత్ సైలనీ బాబా 115 గందం ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేడుకలకు రాష్ట్ర హోంమంత్రి ఎండీ మహమూద్ అలీ, పరకాల, వర్ధన్నపేట, తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేష్, నన్నపేనేని నరేందర్, దాస్యం వినయ్ భాస్కర్ తో పాటు బీజేపీ నేత హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ జిల్లా అధ్యక్షులు రావు పద్మ, పరకాల నియోజకవర్గ ఇన్ చార్జి విజయ్ చందర్ రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగు రాకేష్ రెడ్డి హాజరుకాగా దర్గా పీఠాధిపతి మహమ్మద్ అబ్దుల్ హమీద్ వారిని ఆహ్వానించారు. మహారాష్ట్ర కళాకారుల ప్రత్యేక బ్యాండ్ వాయిద్యాలు, గుర్రపు విన్యాసాలు అలరించాయి. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అతిథులకు సైలని బాబా దీవెనలు అందించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments