Wednesday, May 21, 2025
Homeక్రైమ్చెట్టు కోస్తుండగా.. మిషన్ రంపం తగిలి వ్యక్తి మృతి

చెట్టు కోస్తుండగా.. మిషన్ రంపం తగిలి వ్యక్తి మృతి

స్పాట్ వాయిస్,(టేకుమట్ల) చిట్యాల: చెట్టు కోస్తుండగా.. మిషన్ రంపం తగిలి వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాద ఘటన జయశంకర్ భూపాలపల్లి చిట్యాల మండలంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని గోపాల్ పూర్ గ్రామానికి చెందిన పైడయ్య(50) అదే గ్రామంలోని మరో వ్యక్తి చెందిన చెట్టును రంపపు మిషన్‌తో కోయడానికి కూలి పనికి వెళ్లాడు. చెట్టు కోస్తున్న క్రమంలో చెట్టు కొమ్మ విరిగి, తన చేతిలో ఉన్న రంపపు రన్నింగ్ మిషన్ కాస్త పైడయ్య చాతిపై పడడంతో తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై శ్రావణ్ కుమార్ పైడయ్య మృతదేహాన్ని పరిశీలించి, మృతికి గల వివరాలను సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments