Sunday, February 23, 2025
Homeక్రైమ్లొంగిపోయిన ప్రొటెక్షన్‌ గ్రూప్‌ కమాండర్‌..

లొంగిపోయిన ప్రొటెక్షన్‌ గ్రూప్‌ కమాండర్‌..

వంజెం కేషాపై రూ.4లక్షల రిమాండ్
వివరాలు వెల్లడించిన సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా
స్పాట్ వాయిస్, హన్మకొండ: నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ గొత్తికొయ ఏరియా కమిటీ సభ్యురాలు, కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డి ఆలియాస్‌ కొసా ప్రొటెక్షన్‌ గ్రూప్‌ కమాండర్‌ వంజెం కేషా ఆలియాస్‌ జిన్ని శుక్రవారం వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా ఎదుట లొంగిపోయింది. ఈ మేరకు శుక్రవారం సీపీ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఛత్తీస్‌గడ్‌ రాష్ట్రం బీజాపూర్‌ జిల్లా, పామెడ్‌ మండలం, రాసపల్లి గ్రామానికి చెందిన వంజెం కేషా తండ్రి హిడ్మా కూడా (ప్రస్తుతం ఇతను జైలులో ఉన్నాడు) మావోయిస్టు పార్టీలో పని చేసే వాడు. దీనితో కేషా కూడా బాల్యంలో చైతన్య నాట్య మండలిలో పని చేయడంతో మావోయిస్టు పార్టీకి చెందిన సభ్యులతో పరిచయాలు కావడంతో 2017లో పామెడ్‌ లోకల్‌ స్క్వాడ్‌ కమాండర్ గొట్టే కమల ద్వారా మావోయిస్టు పార్టీలో చేరిన కేషా రెండేళ్ల పాటు పున్నెం జోగ అధ్వర్యంలో చైతన్య నాట్యమండలిలో పనిచేసింది. ఇదే సంవత్సరం కేషాను పార్టీ నాయకత్వం అబుజ్‌మడ్‌ ప్రాంతానికి బదిలీ చేసి కేంద్ర కమిటీ సభ్యుడు కడారీ సత్యనారాయణ రెడ్డికి ప్రొటెక్షన్‌ గ్రూప్‌ సభ్యురాలిగా నియమించింది. 2021లో కేంద్ర మవోయిస్టు నాయకత్వం కేషాను ఏరియా కమిటీ సభ్యురాలిగా నియమించారు. 2022 డిసెంబర్‌ వరకు ప్రొటెక్షన్‌ గ్రూప్‌ సభ్యురాలిగా పనిచేసి కేషా మరో మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యుడు రమేష్‌ను (ప్రస్తుతం మహరాష్ట్ర జైలులో ఉన్నాడు) వివాహం చేసుకోని ఉత్తర బస్తర్‌ డివిజన్లో కొద్ది కాలం పని చేసింది. అనంతరం 2024 ఎప్రిల్‌ మాసంలో తిరిగి కేంద్ర కమిటీ సభ్యుడు కడారి సత్యనారాయణ రెడ్డి ఆలియాస్‌ కొసా ప్రొటెక్షన్‌ గ్రూప్‌ మహిళా కమాండర్‌ బాధ్యతలు చేపట్టింది.
నేరాల వివరాలు
పార్టీలో పనిచేసిన సమయంలో కొహిలబేడా పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మావోయిస్టు పార్టీ సభ్యులతో కలిసి పోలీసులపై కాల్పులు జరపడంతో ఒక పోలీస్‌ అధికారి మరణించగా మరో పోలీస్‌ అధికారి తీవ్రంగా గాయపడిన ఘటనలో జిన్ని ఉన్నారు. అలాగే అబుజ్‌మడ్‌లో ప్రాంతంలో పోలీసులపై జరిపిన కాల్పుల్లో ఒక పోలీస్‌ అధికారి మరణించాడు. రాష్ట్ర ప్రభుత్వం లొంగిపోయిన మావోయిస్టు పార్టీ సభ్యులకు అందిస్తున్న పునరావాస పథకాలకు అకర్షితులుకావడంతో పాటు, ప్రధానంగా తాను సురక్షితంగా లొంగుబాటు అయ్యేందుకు పూర్తి సహయ సహకారాలు అందిస్తామని వరంగల్‌ కమిషనరేట్‌ పోలీస్‌ అధికారులు ఇచ్చిన వాగ్దానంతో లొంగిపోయినట్లు సమాచారం. వంజెం కేషాపై 4లక్షల రూపాయల ప్రభుత్వ రివార్డు ఉన్నట్లుగా సీపీ వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments