Friday, September 20, 2024
Homeక్రైమ్తాగి వేధిస్తున్నాడని..

తాగి వేధిస్తున్నాడని..

తాగి వేధిస్తున్నాడని..

భర్తను హత్య చేసిన భార్య..

సహకరించిన పిల్లలు

వరంగల్ జిల్లాలో ఘటన

స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్ : తాగి వచ్చి వేధిస్తున్నాడని కట్టుకున్న భర్తను కడతేర్చింది భార్య. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పర్వతగిరి మండలం ముంజాల కుంట తండా వద్ద జాటోతూ శ్రీను ఐదు రోజుల క్రితం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. దర్యాప్తు లో సంచలన విషయాలు వెలుగు చూశాయి. మృతుని భార్య శాంతి.. భర్తను అంతమొందించిది. ఇందుకు ఆమె ఇద్దరు పిల్లలు, మరో వ్యక్తి సహకరించారని గుర్తించారు. నిందితులు శ్రీనును హత్యచేసి.. రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా చిత్రీకరించారని తెలిపారు. ఈ క్రమంలోనే నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించామని మామునూరు ఏసీపీ కృపాకర్ వెల్లడించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments