Monday, September 23, 2024
Homeక్రైమ్వరంగల్ లో తీవ్ర విషాదం..

వరంగల్ లో తీవ్ర విషాదం..

వరంగల్ లో తీవ్ర విషాదం..
లారీ ని ఢీకొన్న ఇన్నోవా

ముగ్గురు అక్కడికక్కడే మృతి
మరో ఆరుగురికి గాయాలు..!

మృతులు వరంగల్ పెరికవాడ వాసులు!
స్పాట్ వాయిస్ , వర్ధన్నపేట: వరంగల్ జిల్లాలో విషాదం నెలకొంది. ఆగిఉన్న లారీని ఇన్నోవా ఢీకొనడంతో ముగ్గురు అక్కడి కక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. వర్ధన్నపేట పట్టణ శివారు డీసీ తండా వద్ద వరంగల్ జాతీయ రహదారిపై తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని ఇన్నోవా వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం కు తరలించినట్టు సమాచారం.

మృతులు వరంగల్ పట్టణవాసులు..!
ఈ ప్రమాదంలో చనిపోయిన వారు వరంగల్ పట్టణంలో ని పెరికవాడకు చెందిన వారీగా గుర్తించారు. వీరు ఒంగోలు నుంచి వరంగల్ కు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారులో 9 మంది ఉన్నట్లు సమాచారం… మృతులు కృష్ణారెడ్డి, వరలక్ష్మి, వెంకట సాయి రెడ్డి, మరో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి.  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments