Sunday, June 8, 2025
Homeక్రైమ్వరంగల్ లో విషాదం..

వరంగల్ లో విషాదం..

స్పాట్ వాయిస్ , వరంగల్ : భారీ వర్షాలతో వరంగల్ లో విషాదం నెలకొంది. ఇల్లు కూలి ఇద్దరు మృతి చెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. వరంగల్ మండిబజార్ లో శుక్రవారం అర్ధరాత్రి ఇల్లు కూలిపోయి, పైడి (60) అనే వృద్ధుడు,ఫిరోజు (20) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.అలాగే సమ్మక్క అనే మహిళకు తీవ్ర గాయాలు కాగా హాస్పిటల్ కు తరలించారు. వరుస వర్షాలతో భవనం నాని కూలిపోయినట్లు సమాచారం. ఇదిలా ఉంటే భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని, ప్రమాదకరంగా, శిథిలావస్థకు చేరిన ఇళ్లలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం చెబుతున్నా.. బల్దియా పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రాణనష్టం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments