Wednesday, April 9, 2025
Homeజిల్లా వార్తలువడ బలిజ డివిజన్ అధ్యక్షుడిగా జగదీష్

వడ బలిజ డివిజన్ అధ్యక్షుడిగా జగదీష్

వడ బలిజ డివిజన్ అధ్యక్షుడిగా జగదీష్

స్పాట్ వాయిస్ నర్సంపేట: వడ బలిజ సంక్షేమ సంఘం నర్సంపేట డివిజన్ నూతన అధ్యక్షుడిగా మహాదేవుని జగదీష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కాన్ఫరెన్స్ హాల్ లో వడ బలిజ సంఘం డివిజన్ పరిధిలోని కమిటీ సమావేశం ఆదివారం నిర్వహించి నూతన డివిజన్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గౌరవ అధ్యక్షుడు శాన ఉమామహేశ్వర్, గుంపెల్లి మునీశ్వర్, మహాదేవుని రాజవీరు లు హాజరు కాగా వారి సమక్షంలో ఎన్నిక నిర్వహించి డివిజన్ కమిటీ అధ్యక్షుడిగా జగదీష్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఉపాధ్యక్షుడిగా పెనాల రమేష్, కార్యదర్శిగా కాపాటి నాగేందర్, కోశాధికారిగా మహాదేవుని స్రవంతి, సహాయ కార్యదర్శిగా యజ్ఞం రవీందర్ ,కార్యవర్గ సభ్యులుగా కొఠారి లింగయ్య, గుంపెల్లి రవీందర్ , బక్కర సంపత్, మహాదేవుని కిరణ్, బక్కెర కిషోర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు మహాదేవుని జగదీశ్ మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలో వడ బలిజ సంఘం అభివృద్ధి కోసం ఎల్లవేళలా కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వడ బలిజ సంఘ కులస్తులకు సంక్షేమ పథకాలు అందజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బద్రి శ్రీనివాస్, చరణ్, రాజు, రాజేందర్, కాపాటి రాజయ్య , సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments