Saturday, September 21, 2024
Homeక్రైమ్వరంగల్‌లో విషాదం

వరంగల్‌లో విషాదం

పాతభవనం కూలి ఇద్దరు మృతి
స్పాట్ వాయిస్, వరంగల్: వరంగల్ నగరంలోని చార్‌బౌళిలో విషాదం చోటు చేసుకుంది. పాత భవనాన్ని కూల్చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ప్రకాష్, సునీత అనే కార్మికులపై శకలాలు పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. అలాగే శ్రీనివాస్, జ్యోతి అనే మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. చార్ బౌలి రోడ్డులో విధులు నిర్వహిస్తున్న ఇంతేజార్ గంజ్ ఎస్సై నాగరాజు వెంటనే స్పందించి తన వాహనంలో క్షతగాత్రులను ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments