వనజీవి రామయ్య కన్నుమూత..
కోటి మొక్కలు నాటిన రామయ్య..
స్పాట్ వాయిస్, బ్యూరో: పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య కన్నుమూశారు. శనివారం తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన మృతి చెందారు. మొక్కల ప్రేమికుడు రామయ్య ఇంటిపేరునే వనజీవిగా మార్చుకున్నారు. జీవితమంతా మొక్కలు నాటి పెంచారు. రామయ్య ది ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి. కోటికి పైగా మొక్కలు నాటి ఆయన సరికొత్త చరిత్రను సృష్టించారు. 2017లో ఆయన పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.
Recent Comments