Wednesday, April 9, 2025
Homeక్రైమ్కోడలిపై మామ దాడి

కోడలిపై మామ దాడి

ఆస్తి పంపకాల వివాదమే కారణం..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘటన
స్పాట్ వాయిస్, గణపురం: ఆస్తి పంపకాల వివాదం నేపథ్యంలో కోడలిపై మామ దాడి చేసిన ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం ధర్మారావుపేట గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. బాధితురాలు కేశెట్టి లావణ్య కథనం మేరకు.. గ్రామానికి చెందిన కేశెట్టి మల్లయ్య కుమారుడు గిరిబాబుతో లావణ్యకు వివాహమై చాలా కాలమైంది. భర్త గిరిబాబు నాలుగేళ్ల క్రితం ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. అనంతరం ఆస్తి పంపకాలు చేసుకున్నారు. కాగా తన వాటా కింద వచ్చిన ఎకరం పొలాన్ని దక్కించుకునేందుకు మామ మల్లయ్య తరచూ ఆమెను బెదిరిస్తున్నాడు. ఈ క్రమంలో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ కూడా జరిగింది. కాగా, శనివారం పొలంలో మామ మల్లయ్య నాటు వేస్తున్నాడని పొలం వద్దకు లావణ్య వెళ్లింది. దీంతో కోపోద్రిక్తుడైన మామ పారతో కోడలిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. లావణ్యకు తలకు బలమైన గాయాలు కావడంతో 108లో ములుగు సివిల్‌ ఆస్పత్రికి తరలించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments