Monday, September 30, 2024
Homeక్రైమ్చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి

విషాదం మిగిల్చిన బంధువు దశదిన కర్మ
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘటన
స్పాట్ వాయిస్, రేగొండ:
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం నెలకొంది. ఇద్దరు పిల్లలు చెరువులో మునిగి మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. రేగొండ మండలం దుంపిల్లపల్లి గ్రామానికి తాటికంటి రమేశ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. గురువారం దశ దిన కర్మ నిర్వహిస్తుండగా.. మొగుళ్లపల్లి గ్రామానికి గుండాల సురేశ్-భాగ్యలక్ష్మి దంపతులతో పాటు వారి కుమారుడు వర్షిత్ (7), కమలాపురం మండలం గుండెడు గ్రామానికి కోటేశ్వర్రావు, -రాణి దంపతులు కొడుకు (11) తో కలిసి వచ్చాడు. మృతు రమేశ్ ఇంటి సమీపంలో ఉన్న కుంట వద్దకు వీరి పిల్లలు బహిర్భూమికి వెళ్లగా ప్రమాదవశాత్తు జారి పడిపోయారు. ఈత రాకపోవడంతో మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు రేగొండ ఎస్సై శ్రీకాంత్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను వెలికి తీయించారు. బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments