Saturday, September 21, 2024
Homeజిల్లా వార్తలుదేశానికే దిక్సూచి దళిత బంధు

దేశానికే దిక్సూచి దళిత బంధు

దేశానికే దిక్సూచి దళిత బంధు

దళిత కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న పథకం
10లక్షలు అందిస్తున్న గొప్ప మహనీయుడు సీఎం కేసీఆర్

ఎమ్మెల్యే అరూరి రమేష్

స్పాట్ వాయిస్, హన్మకొండ రూరల్: షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గొప్ప పథకం దళిత బంధు అని టీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా వర్ధన్నపేట నియోజకవర్గం గ్రేటర్ వరంగల్ పరిధి లోని మునిపల్లె,బట్టుపల్లి, కొత్తపల్లి, చింతగట్టు, గ్రామాలకు చెందిన ఆరుగురు దళిత బందు లబ్ధిదారులకు ఎమ్మెల్యే ప్రొసీడింగ్స్ కాపీలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతీ దళిత కుటుంబం ఆర్థికంగా పరిపుష్టి సాధించాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టినట్లు తెలిపారు. దళితుల పట్ల సమాజంలో నెలకొన్న తారతమ్యాలను రూపు మాపడమే దళిత బందు పథకం ప్రధాన ఉద్దేశం అని పేర్కొన్నారు. లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments