Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలుఅసత్యాలు ప్రచారం చేస్తే ఖబడ్దార్

అసత్యాలు ప్రచారం చేస్తే ఖబడ్దార్

అసత్యాలు ప్రచారం చేస్తే ఖబడ్దార్
-ఎంపీపీ అన్నమనేని అప్పారావు, మండల పార్టీ అధ్యక్షుడు తూళ్ళ కుమారస్వామి

స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: రెండు రోజులుగా ఎమ్మెల్యే అరూరి రమేష్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై వర్ధన్నపేట ఎంపీపీ అప్పారావు, టీఆర్ ఎస్ మండలాధ్యక్షుడు తూళ్ళ కుమారస్వామి స్పందించారు. ల్యాబర్తి గ్రామ సర్పంచ్ పై వస్తున్న వ్యక్తిగత ఆరోపణలను పార్టీకి.. ఎమ్మెల్యే కు ఆపాదించడాన్ని  తీవ్రంగా ఖండించారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టం ముందు సమానమేనని పునరుద్ఘాటించారు. ఊహా జనిత కట్టుకథలను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ..రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న ప్రతిపక్ష పార్టీల వారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. మరో సారి ఇలాంటి పోస్టులు పెట్టే ముందు ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ఆరోపణలు చేస్తే సహించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో పీ ఏ సీ ఎస్ చైర్మన్ రాజేష్ ఖన్నా, పట్టణ అధ్యక్షుడు పులి శ్రీనివాస్, టీఆరెఎస్ పార్టీ నాయకులు సిలివేరు కుమారస్వామి,అనిమి రెడ్డి.శ్యామ్ సుందర్ రెడ్డి, కొండేటి శ్రీనివాస్, రహీమ్,బొంత.కాంతం, నందిపాక భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments