Sunday, September 22, 2024
Homeజిల్లా వార్తలుగణపురంలో టీఆర్ఎస్ సంబురాలు

గణపురంలో టీఆర్ఎస్ సంబురాలు

స్పాట్ వాయిస్, గణపురం: మునుగోడు బైపోల్ లో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విజయం ఖాయం కావడంతో ఆదివారం టీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. గణపురం మండలంలో వివిధ గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తలు బాణా సంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు పొలుసాని లక్ష్మీనరసింహారావు,  పీఏసీస్ఎస్ చైర్మన్ పోరెడ్డి పూర్ణచంద్రారెడ్డి ఆధ్వర్యంలో డీజే చప్పుడ్ల మధ్య టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు నారాగాని దేవేందర్ గౌడ్, పొట్ల నగేష్, రామంచ భద్రయ్య, మామిడి రవి, ఎంపీటీసీలు మోటపోతుల శివశంకర్ గౌడ్, మారగాని సరస్వతి శ్రీనివాస్, ఉప సర్పంచ్ పోతర్ల అశోక్, టౌన్ ప్రెసిడెంట్ గుర్రం తిరుపతి, నాయకులు బైరాగాని కుమారస్వామి డాక్టర్ జన్నయ్య, కట్ల శంకరయ్య, మోతె కరుణాకర్ రెడ్డి, గడ్డం రమేష్, సన్నీ, పోశాల మల్లికార్జున్, అంకం చిరంజీవి, పాషా, నారగాని కిషోర్, సల్వాది సురేష్, వడ్ల యాదగిరి, శనిగరపు రాజేందర్, తిక్క సంపత్, దుడపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments