Saturday, April 19, 2025
Homeక్రైమ్నర్సంపేట నియోజకవర్గ టీఆర్ఎస్ లో విషాదం

నర్సంపేట నియోజకవర్గ టీఆర్ఎస్ లో విషాదం

స్పాట్ వాయిస్ ఖానాపురం : అమృతండా కు చెందిన టీఆర్ఎస్ క్రియాశీలక నాయకుడు బోడ వెంకన్న ఆకస్మిక మరణానికి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న భౌతిక కాయాన్ని సందర్శించి, ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసి నివాళులు అర్పించారు. పలు ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసి, నిత్యం పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ, నాయకుల అందరిచేత మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిగా మన్నలను పొందిన యువకుడు, ఉత్సావంతున్ని కోల్పోవడం పార్టీకి తీరని లోటని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ సందర్భంగా వెంకన్న కుటుంబానికి 50 వేల రూపాయలను ఆర్థిక సాయంగా అందించారు. పార్టీ వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు చెన్నారావుపేట మండల నాయకులు, పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొని వెంకన్న మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసి నివాళులు అర్పించారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments