Sunday, September 22, 2024
Homeజిల్లా వార్తలువ్యాక్సినేషన్ హెల్త్ వాలంటీర్లకు సన్మానం

వ్యాక్సినేషన్ హెల్త్ వాలంటీర్లకు సన్మానం

హాజరైన మాజీ ఎమ్మెల్యే కొండేటి శ్రీధర్
స్పాట్ వాయిస్, వర్ధన్నపేట: ప్రధాని నరేంద్రమోడీ ఎనిమిదేళ్ల పాలనలోని ఎన్నో పథకాలు తీసుకొచ్చారని 14వ డివిజన్ అధ్యక్షుడు కొత్తకొండ రాజు అన్నారు. ఈ మేరకు ఆయన ఆధ్వర్యంలో ఆదివారం వ్యాక్సినేషన్ హెల్త్ వాలంటీర్లకు శ్మశాన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ హాజరై కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించారు. కరోనా కష్టకాలంలో హెల్త్ వాలంటీర్ల పాత్ర మరవలేనిదన్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి మోడీ వారిని సన్మానించారంటే గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షురాలు,14వ డివిజన్ ఇన్ చార్జి కాసు శిల్పా, జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు బండారి కల్యాణి, జిల్లా మహిళా మోర్చా ప్రధానకార్యదర్శి సుజాత, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కుచన క్రాంతి, డివిజన్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments