Friday, September 20, 2024
Homeజిల్లా వార్తలువరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు సీఐల బదిలీ

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో నలుగురు సీఐల బదిలీ

 స్పాట్ వాయిస్, క్రైమ్: వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని నలుగురు సీఐలను బదిలీ చేస్తూ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్బీలో ఉన్న ఒంటెరు రమేష్ ను ధర్మసాగర్ కు ట్రాన్స్ ఫర్ చేశారు. ఇక వీర్‌లో ఉన్న అనుమల శ్రీనివాస్ ను పర్వతగిరి సీఐగా బదిలీ చేశారు. అలాగే ధర్మసాగర్ సీఐ బి. రమేశ్ ను వీఆర్ కు పంపారు. ఇదిలా ఉంటే నూతనంగా ఏర్పాటు చేస్తున్న ఏనమాముల మార్కెట్ పోలీస్ స్టేషన్ తొలి  ఇన్ స్పెక్టర్ గా విశ్వేశ్వర్ ను నియమిస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి ఉత్తర్వులు జారీచేశారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments