Sunday, May 19, 2024
Homeక్రైమ్కలహాలకు తల్లీకూతురు బలి

కలహాలకు తల్లీకూతురు బలి

ఇద్దరు పిల్లలతో బావిలో దూకి తల్లీ
తల్లీకూతురు మృతి.. ప్రాణాలతో బయటపడిన కొడుకు
మానుకోట జిల్లాలో విషాదం..
స్పాట్ వాయిస్, నెల్లికుదురు: కలహాలు పచ్చని సంసారంలో విషాదాన్ని నింపాయి. కుమార్తె సహా తల్లి ప్రాణాలు తీసుకున్నాయి. ఈ విషాద ఘటన మహబూబాబాద్​ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. నెల్లికుదురు మండలం శ్రీరామ శివారు వెంకటాపురం గ్రామానికి చెందిన ఆకుల మురళికి, సిద్దిపేట జిల్లాకు చెందిన లావణ్య (30)తో వివాహం జరిగింది. వీరికి కుమారుడు ముఖేష్ (10), కుమార్తె నిత్యశ్రీ (6) ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఈ కుటుంబంలో కొద్ది కాలం నుంచి భార్యాభర్తల మధ్య తరచూ ఘర్షణలు చోటు జరుగుతున్నాయి. భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని భార్య లావణ్య అనుమానం పెంచుకుంది. ఈ క్రమంలో శుక్రవారం భర్తతో ఘర్షణ పడి క్షణికావేశంలో గ్రామంలోని మంచి నీటి బావి దగ్గరకు పిల్లలతో కలిసి వెళ్లింది. కుమారుడు, కుమార్తెను మంచి నీటి బావిలోకి నెట్టి, ఆపై తానూ దూకింది. బాలుడు బావిలోని పైపును పట్టుకొని బయటకు వచ్చి, కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి తల్లీకూతురును బయటకు తీశారు. అప్పటికే వారిద్దరూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న నెల్లికుదురు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. తల్లీబిడ్డల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

RELATED ARTICLES

Most Popular

Recent Comments