Saturday, April 19, 2025
Homeక్రైమ్అగ్నిపథ్ నిరసనలో విషాదం..

అగ్నిపథ్ నిరసనలో విషాదం..

కాల్పుల్లో గాయపడిన యువకుడి మృతి
స్పాట్ వాయిస్, క్రైమ్: అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఆందోళనలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. ఆందోళనకారులు స్టేషన్‌లో విధ్వంసానికి పాల్పడ్డారు. పోలీసులపై రాళ్లదాడికి దిగారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి రైల్వే పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పలువురు గాయపడ్డారు. ఓ యువకుడు మృతిచెందాడు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. గాయపడిన వారిని గాంధీ దవాఖానకు తరలించారు. సికింద్రాబాద్ కాల్పుల్లో చనిపోయిన యువకుడు వరంగల్ జిల్లా ఖానాపురం మండలం దబీర్ పేటలకు చెందిన రాకేష్ గా గుర్తించారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ బోర్డ్‌కి వెళ్లి అక్కడి నుంచి రైల్వేస్టేషన్‌కి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments