Tuesday, September 24, 2024
Homeతెలంగాణరేపు 11.30కు రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ బంద్

రేపు 11.30కు రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ బంద్

రేపు 11.30కు ట్రాఫిక్ బంద్
సామూహిక జాతీయ గీతాలాపనకు ఏర్పాట్లు
పోలీసులకు డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశాలు

స్పాట్ వాయిస్‌, హైదరాబాద్: సామూహిక జాతీయ గీతాలాపనతో సమైక్యతా స్ఫూర్తిని చాటాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 11.30కు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే సామూహిక జాతీయ గీతాలాపనను విజయవంతం చేయడానికి పోలీసులు పని చేయాలని సూచించారు. కలెక్టర్లు, ఇతర పాలనాశాఖల అధికారులతో ఎస్పీలు, పోలీస్‌ కమిషనర్లు సమన్వయం చేసుకోవాలని డీజీపీ చెప్పారు. ట్రాఫిక్‌ జంక్షన్లలో సామూహిక జాతీయ గీతాలాపన కోసం ప్రజలు గుమిగూడే ప్రదేశాలను గుర్తించి 11.30 గంటలకు ట్రాఫిక్‌ నిలిపివేయాలని, మైక్‌సిస్టమ్‌ ద్వారా అలారం మోగించాలని తెలిపారు. అందరూ బాధ్యతగా ఈ చారిత్రాత్మక కార్యక్రమంలో పాల్గొని జాతీయ గీతాలాపన చేయాలని కోరారు.

RELATED ARTICLES

Most Popular

Recent Comments