Thursday, September 19, 2024
Homeతెలంగాణఉత్కంఠకు తెర..

ఉత్కంఠకు తెర..

ఉత్కంఠకు తెర..

రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా మహేష్‌కుమార్‌ గౌడ్ 

స్పాట్ వాయిస్, బ్యూరో : రాష్ట్ర కాంగ్రెస్‌పార్టీలో గత కొంతకాలంగా సాగుతున్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడిగా మహేష్‌కుమార్‌ గౌడ్‌ను ఏఐసీసీ ప్రకటించింది. ఈమేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్య‌క్షుడిగా కొన‌సాగిన సంగ‌తి తెలిసిందే. 2023లో పీసీసీ ఎన్నిక‌ల క‌మిటీ స‌భ్యుడిగా ప‌ని చేశారు. ప్ర‌స్తుతం ఎమ్మెల్సీగా, .  వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా కూడా కొన‌సాగుతున్నారు. ఇక పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వికి మ‌ధుయాష్కీ గౌడ్, జీవ‌న్ రెడ్డి, జ‌గ్గా రెడ్డి, కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి, అద్దంకి ద‌యాక‌ర్ పోటీ ప‌డ్డారు.

కానీ చివ‌ర‌కు రేవంత్‌కు అత్యంత స‌న్నిహితుడైన మ‌హేశ్ కుమార్ గౌడ్‌ను పీసీసీ పీఠం వ‌రించింది. పీసీసీ అధ్య‌క్షుడు ఎవ‌ర‌నే క‌స‌ర‌త్తు రెండు వారాల క్రిత‌మే పూర్త‌యిన‌ప్ప‌టికీ.. కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా నేడు ప్ర‌క‌టించింది.

RELATED ARTICLES

Most Popular

Recent Comments